కొహ్లి కెప్టెన్సీలో భారత జట్టు విజయ దుంధుంభీ మోగించడం కొనసాగిస్తూనే ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లను కైవసం చేసుకుని మంచి ఫాంలో ఉన్న టీం ఇండియా బంగ్లాదేష్ తో జరిగిన ఒక్క టెస్ట్ సీరీస్ లో విజయ పతాకం ఎగురవేసింది. 459 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేష్ జట్టు నాలుగో రోజు ముగిసే సరికి 103 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.


ఈరోజు మొదటి నుండి ఆత్మ రక్షణలో పడిన బంగ్లాదేష్ జట్టు కనీసం డ్రా కోసం బాగా ప్రయత్నించింది. కాని భారత్ బౌలర్లు అశ్విన్, జడేజాలు వారికి ఛాన్స్ ఇవ్వకుండా వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 4, జడేజా 4 వికెట్లు తీయడం జరిగింది. ఫైనల్ గా బంగ్లాదేష్ మీద 208 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: