వరుస విజయాలతో దూసుకుపోతున్న టీం ఇండియా స్వదేశంలో మరో టెస్ట్ సీరీస్ కు సిద్ధమవుతుంది. ఆస్ట్రేలియాతో 4 టెస్ట్ ల సీరీస్ ఆడనున్నారు. ఫిబ్రవరి 23నుండి స్టార్ట్ అవుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు జట్టు ఎంపిక జరిగింది. మొదటి రెండు టెస్ట్ లకు మ్యాచ్ ఆడే టీం ను ఎనౌన్స్ చేశారు.
విరాట్ కొహ్లి సారధ్యంలో ఆడనున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ సీరీస్ లో గాయపడిన మహ్మద్ షమితో పాటుగా బంగ్లాదేష్ టెస్ట్ మ్యాచ్ కు దూరమైన అమిత్ మిశ్రా కూడా స్థానం దక్కించుకోలేదు. జట్టు సభ్యులను బిసిసిఐ ఎనౌన్స్ చేసింది. విరాట్ కోహ్లీ(కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా(వికెట్కీపర్), అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ ముకుంద్, పాండ్యా.