భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టేస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు ముందు కాస్త తడబడ్డా మళ్లీ నిలదొక్కుకుంది. 140 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టుని కెప్టెన్ స్మిత్ మెరుగైన ఆటతీరుతో సెంచరీ సాధించి జట్టు స్కోర్ ను ముందుకు నడిపించాడు. ఇక స్మిత్ తో పాటుగా మాక్స్ వెల్ కూడా 82 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.  


భారత బౌలర్లు ఉమేష్ రెండు వికెట్లు తీయగా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తీశారు. మొదటి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రెలియా 299 పరుగులు చేసింది. 117 పరుగుల వద్ద సంతి మంచి ఫాంలో ఉన్నాడు. మొదటి రోజు మొదట మురిపించిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత చల్లబడ్డారు. మరి రెండో రోజు ఆట ఎలా సాగనుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: