భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. 1-1తో సమానంగా ఉన్న ఇరుజట్లు మూడో టెస్ట్ లో ఆధిపత్యం సాధించాలని చూశాయి. కాని ఫైనల్ గా భారత ఆస్ట్రేలియా ఇరు జట్లు మెరుగైన ఆట ప్రదర్శించి మ్యాచ్ డ్రాగా మిగిల్చారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 451 పరుగులకు ఆలౌట్ కాగా.. మొదటి ఇన్నింగ్స్ 603 పరుగులు చేసింది టీం ఇండియా. ఇక రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు 23/2 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తో ఆట స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియ 204 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.


మ్యాచ్ పైచేయి సాధించే ప్రయత్నం చేసిన భారత్ ఆశలకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడ్డుకట్టవేశారు. నాలుగు మ్యాచుల సీరీస్ లో 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్లు ఆడనున్న నాలుగో టెస్ట్ లో సీరీస్ విజేత ఎవరన్నది తేలుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: