భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ధాటికి ఆసిస్ బ్యాట్స్ మన్ తలవంచక తప్పలేదు. మొదటి నుండి ఎటాకింగ్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ను ముప్పతిప్పలు పెట్టారు భారత బౌలర్లు. అశ్విన్ 3, జడేజా 3, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టుని 137 పరుగులకు ఆలౌట్ చేశారు. 


106 పరుగులు చేస్తే నాలుగో టెస్ట్ మాత్రమే కాదు సీరీస్ కూడా సొంతం చేసుకుంటుంది భారత జట్టు. జరిగిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా పై చేసి సాధించినట్టు కనిపించగా నాలుగో టెస్ట్ మాత్రం భారత ఆటగాళ్లు పోటాపోటీగా ఆడారు. ప్రస్తుతం టీం ఇండియా 19 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు లోకేష్ రాహుల్ 13, మురళి విజయ్ 6 తో ఉన్నారు. 87 పరుగులు చేస్తే భారత జట్టు విజయం సాధించినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: