ఈరోజు జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో ఢిల్లి డెర్ డెవిల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్లు సాం సన్ 19 పరుగులే చేసినా సాం బిల్లింగ్స్ 55 పరుగులతో ఢిల్లి స్కోర్ పరుగులు పెట్టించాడు. చివర్లో అండర్ సన్ 39 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 188కి చేర్చాడు.


ఇక భారీ గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్లు మనన్ ఓరా 3, హషిం ఆమ్లా 19 పరుగులే చేశారు. ఆ తర్వాత మోర్గాన్ 22, మిల్లర్ 24 పరుగులక్ అవుట్ అవగా చివర్లో అక్సర్ పటేల్ 44 మెరుపు ఇన్నింగ్స్ ఆడినా బాల్స్ తగ్గుతూ ఛేధించాల్సిన స్కోర్ పెరుగుతూ వచ్చింది. ఫైనల్ గా 20 ఓవర్లకు 9  వికెట్లకు గాను 137 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ జట్టు. ఈ ఓటమితో పంజాబ్ వరుసగా రెండు మ్యాచులను ఓడినట్టయింది. ఇక మొదటి మ్యాచ్ ఓడినా మొన్న పూణె ఈరోజు పంజాబ్ మీద గెలిచి సత్తా చాటుతుంది ఢిల్లి జట్టు.  



మరింత సమాచారం తెలుసుకోండి: