ఐపిఎల్ ఈ సీజన్ లో ఈరోజు మ్యాచ్ లో ముంబై తో తలపడింది గుజరాత్ లయన్స్ జట్టు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు గుజరాత్ కు 20 ఓవర్లలో 176 పరుగులు ఇచ్చింది. గుజరాత్ బ్యాట్స్ మన్ లో మెక్ కల్లం 64 విజృంభించగా దినేష్ కార్తిక్ 48 కెప్టెన్ సురేష్ రైనా 28 పరుగులు చేశారు. ఫైనల్ గా 4 వికెట్లకు 176 పరుగులు చేసింది గుజరాత్ లయన్స్. 


ఇక 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు పార్ధివ్ పటేల్ డకౌట్ అవగా, బట్లర్ 26 పరుగులు చేశాడు. ఇక ఈ సారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని విజయ పధంలో నడిపించాడు రోహిత్ శర్మ. నితిష్ రానా 53తో రోహిత్ అజేయంగా 40 పరుగులు చేశాడు. ఇక పొలార్డ్ కూడా 39 పరుగులతో ముంబై విజయానికి మూల కారణం అయ్యాడు. ఫైనల్ గా 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసింది ముంబై. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: