ఐపిఎల్ 2017 సీజన్ లో 17వ మ్యాచ్ గా జరిగిన బెంగళూరు వర్సెస్ పూణె జట్ల జట్ల మధ్య మ్యాచ్ మంచి రస్తవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు పూణె కు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు అందించారు. పూణె జట్టులో రహనే 30, రాహుల్ తిరుపతి 31 ఓపెనింగ్ స్టార్ట్ అదరగొట్టగా కెప్టెన్ స్మిత్ 27, ఎం.ఎస్ ధోని 28 పరుగులు చేశారు. ఇక చివర్లో మనోజ్ తివారి 27 పరుగులతొ జట్టు స్కోర్ ను 161 కి చేర్చాడు. 


ఇక నిర్ణీత ఓవర్లలో 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లి 28 క్లిక్ అయినట్టు కనిపించినా ఎబి డివిలర్స్ 29 తప్ప మిగతా వారంతా తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఫైనల్ గా 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు జట్టు. 27 పరుగుల తేడాతో బెంగళూరు పై పూణె విజయం సాధించింది. ఈ ఓటమితో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో లీస్ట్ స్థానంలో ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: