ఈ ఐపిఎల్ లో చివరి బంతికి విజయం సాధించిన జట్టు పూణెదే అని చెప్పాలి. చివరి బంతి దాకా ఉత్కంటతతో సాగిన పూణె హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ ఈ సీజన్ లోనే సూపర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన పూణె మొదట బౌలింగ్ తీసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ జట్టు ఓపెనర్ వార్నర్ 43, థావన్ 30 మంచి స్టార్ట్ ఇచ్చినా ఆ తర్వాత విలియం సన్ 21 పరుగులే చేశాడు. ఇక హెన్రిక్స్ 55 పరుగులు చేసి జట్టు స్కోర్ ను నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది.


ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ రహనే 2 పరుగులకే అవుట్ అవగా రాహుల్ త్రిపాటి 59 పరుగులు చేయగా అతనికి తోడు స్టీవ్ స్మిత్ 27 స్కోర్ కదిలించగా ఎమ్మెస్ ధోని 61 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సిన క్రమంలో ధోని ఫోర్ కొట్టి పూణెకు ఘన విజయం అందించాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: