ఐపిఎల్ 26వ మ్యాచ్ గా జరిగిన గుజరాత్ లయన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య పోటీలో కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోగా పంజాబ్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో ఆంలా 65, షాన్ మర్ష్ 31, మ్యాక్స్ వెల్ 30 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో అక్సర్ పటేల్ 34 పరుగులు చేయగా కింగ్స్ ఎలవన్ పంజాబ్ 7 వికెట్లకు 188 పరుగులు చేశారు.


ఇక లక్ష్య ఛేధనలో బరిలో దిగిన గుజరాత్ జట్టులో ఓపెనర్లు మెక్ కల్లం 6, ఫించ్ 13 పరుగులే చేయగా సురేష్ రైనా 32, దినేష్ కార్తిక్ 58 పరుగులు చేశారు. వీరిద్దరి వికెట్ల తర్వాత మ్యాచ్ ను నిలబెట్టలేకపోయారు. చివర్లో ఆడ్రూ టై 22 భారీ షాట్స్ కు ప్రయతించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇక నిర్ణీత ఓవర్లలో 7 విఎక్ట్లకు 162 పరుగులు చేసింది గుజరాత్ జట్టు.  



మరింత సమాచారం తెలుసుకోండి: