ఐపిఎల్ లో అత్యంత పేలవమైన ఆటతీరుని ప్రదర్శించిన బెంగళూరు జట్టు లీగ్ దశలోనే వాకవుట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ లీగ్ లో చివరి మ్యాచ్ ఢిల్లి డేర్ డెవిల్స్ మీద తలప్ప బెంగళూరు జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. లీగ్ దశలో 14 మ్యాచులు ఆడిన ఆర్సిబి కేవలం 3 మ్యాచులను మాత్రామే విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.


ఈ క్రమంలో ఈరోజు జరిగిన ఢిల్లి మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సిబి 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 48, విరాట్ కొహ్లి 58 పరుగులు చేయగా బెంగళూరు 20 ఓవర్లకు 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఇక గెలుగు లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లి కరున్ నాయిర్ 26, రిషబ్ పంత్ 45, శ్రేయస్ అయ్యిర్ 32 పరుగులు చేశారు. చివర్లో వికెట్లు టప టపా పడటంతో 20 ఓవర్లకు 151 పరులు మాత్రమే చేయగలిగారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: