అనుకున్నట్టుగానే ఐపిఎల్ క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబై జట్టుకి పెద్ద షాక్ ఇచ్చింది పూణె జట్టు. లీగ్ దశలో రెండు సార్లు తలపడిన పూణె ముంబై జట్లు. రెండు సార్లు పూణేనే గెలిచింది. ఇక క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబై గెలిచి సత్తా చాటుతుంది అంటే మళ్లీ పూణె విజయం సాధించింది. 


టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకుంది.. పూణె బ్యాటింగ్ లో అంజిక్య రహనే 56, మనోజ్ తివారి 58, ధోని 40 పరుగులు చేయగా 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది పూణె. ఇక గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు సిమన్స్ 5 పరుగులకే అవుట్ అవగా పార్ధివ్ పటేల్ 52 పరులు చేశాడు. రొహిత్ శర్మ 1 పరుగుకే అవుట్ అవగా 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేశారు ముంబై ఆటగాళ్లు. ముంబై పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపిఎల్ 2017 10వ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది పూణె జట్టు. 



మరింత సమాచారం తెలుసుకోండి: