ఐపిఎల్ లో క్వాలిఫైర్ సెకండ్ మ్యాచ్ లో ముంబై చేతిలో కలకత్తా ఘోరంగా ఓడి పోయింది. టాస్ ఓడిన గంభీర్ సేన తొలిత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే బ్యాట్స్ మన్ అందరు ఆడాల్సిన అసలు మ్యాచ్ లో చేతులెత్తేశారు. అందుకనే 20 ఓవర్లలో 107 పరుగులకే కలకత్తా ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ముంబై సునాయాసంగా ఆ లక్ష్యాన్ని అందుకుంది.


ఐపిఎల్ పదవ సీజన్ లో లీగ్ దశల్లో చాలా స్ట్రాంగ్ గా కనిపించి అప్పటిదాకా పాయింట్ల పట్టికలో ఒకటి రెండు స్థానల్లో ఉన్న గంభీర్ సేన నిన్న క్వాలిఫైర్ మ్యాచ్ ఓడడంతో ఐపిఎల్ నుండి నిష్క్రమించింది. ఆ భాధతో ఈ సీజన్ లో తమకు సపోర్ట్ గా నిలిచిన అభిమానులకు ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చాడు గంభీర్. శక్తిమేరకు కష్టపడ్డాం కాని ఆ కష్టం సరిపోలేదు. మీ ఆదరణకు ధన్యవాదాలని తెలిపాడు గంభీర్. మ్యాచ్ ఓడిన ప్రజల మనసు గెలిచాడు గంభీర్.



మరింత సమాచారం తెలుసుకోండి: