జూన్ 1 నుండి 18 వరకు జరుగనున్న చాంపియన్స్ లీగ్ ట్రోఫీకి భారత జట్టు బౌలింగ్ కోచ్ గా జహీర్ ను నియమించాలని స్పిన్నర్ హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ లో ఢిల్లి జట్టు కెప్టెన్ గా ఉన్న జహీర్ అనుభవం బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుందని భజ్జి అన్నాడు. ఇక హర్భజన్ అభిప్రాయాన్ని నెటిజెన్లు కూడా ప్రోత్సహించడం జరిగింది.
చాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడేందుకు ఈమధ్యనే బోర్డ్ మీటింగ్ జరిగింది. అందులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లి, కోచ్ అనీల్ కూబ్లే పాల్గొన్నారు. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఇషాంత్ శర్మ, ఆల్రౌండర్ హర్దిక్ పాండ్య లాంటి ఫేసర్లు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ ఉండగా బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ తో ఒప్పందం ముగిసింది. ప్రస్తుతం బౌలింగ్ కోచ్ గా ఎవరిని తీసుకోవాలని బిసిసిఐ చర్చలు జరుపుతుంది.