టీం ఇండియాలో మహేంద్ర బాహుబలి ఎవరు అంటే వెటరెన్ ప్లేయర్ సెహ్వాగ్ ఇంకెవరు మహేంద్ర సింగ్ ధోనినే అంటున్నాడు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్ డే మ్యాచ్ లో విరాట్, యువరాజ్ సింగ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ధోని 63 పరుగులతో అలరించాడు. జట్టుకి అవసరమైన సమయాలలో అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చే ధోని మహేంద్ర బాహుబలి అని సెహ్వాగ్ అన్నాడు.


చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ స్పోర్ట్స్ చానెళ్ జరుగుతున్న మ్యాచ్ లకు సెహ్వాగ్ ను కామెంటేటర్ గా ఉంచారు. ఆటలోనే కాదు కమెంటరీలో కూడా సెహ్వాగ్ చమత్కారం ఏమాత్రం తగ్గలేదు. ధోనిని మహేంద్ర బాహుబలి అని సంభోదించి ఫ్యాన్స్ ను ఉత్తేజపరచాడు సెహ్వాగ్. 



మరింత సమాచారం తెలుసుకోండి: