చాంపియన్స్ ట్రోఫీలో సెమి ఫైనల్స్ లో టీం ఇండియా బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బంగ్లా బ్యాట్స్ మన్ 264 పరుగులకే కట్టడి చేశారు. బంగ్లా టీంలో ఇక్బాల్ 70, రహిం 61 పరుగులు చేశారు. 50 ఓవర్లలో 7 వికెట్లకు గాను 264 పరుగులు చేసింది బంగ్లాదేశ్ జట్టు. 


ఇక లక్ష్య సాధనలో భారత జట్టు ఏమాత్రం కష్టపడకుండా విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ అజేయంగా 123 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 46 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక ఫస్ట్ డౌన్ లో  దిగిన విరాట్ కొహ్లి 96 పరుగులతో జట్టుకి విజయం అందించాడు. 40.1 ఓవర్ లోనే భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 265 పరుగులు చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ తో ఫైనల్ లో తలపడనుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: