చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన ఇండియా పాకిస్తాన్ లు ఈ ఆదివారం తలపనున్నాయి. ఆదివారం నాటి మ్యాచ్ కోసం అంతటా ఉత్కంటత నెలకొంది. యాదాదుల పోరులో ఎవరిది పైచేయి అవుతుందని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ను క్యాష్ చేసుకునేందుకు స్టార్ స్పోర్ట్స్ వారు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటలకు మోత మోగిస్తున్నారట.  


సాధారణంగా తీసుకునే దానికంటే 10 రెట్లు ఎక్కువగా చార్గ్ చేస్తున్నారట. అంటే 30 సెకన్ల యాడ్ కోసం దాదాపు కోటి రూపాయలదాకా వెచ్చించాల్సి ఉంటుందట. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇరుదేశాల క్రికెట్ అభిమానులు మ్యాచ్ తప్పనిసరిగా చూస్తారు. అందుకే స్టార్ స్పోర్ట్స్ వారు ఇలా ప్లాన్ చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: