ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా మొదట పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ను ఢీ కొనేందుకు పాకిస్తాన్ భారీ లక్ష్యాన్నే ముందుంచారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అజార్ ఆలి 59, ఫకర్ జమన్ 114 పరుగులు చేయగా, బబర్ అజాం 46, మహ్మద్ హఫీజ్ 57 పరుగులు చేశారు.  


మొదట నుండి భారత బౌలర్లను ఢీటుగానే ఎదుర్కున్నారు పాకిస్తాన్ జట్టు. ఇక ఈ పోరులో గెలవాలంటే టీం ఇండియా 339 పరుగులు చేసి తీరాల్సిందే. అప్పుడే అసలైన విజయం అందుకున్నట్టు లెక్క. ఫుల్ ఫాంలో ఉన్న భారత జట్టు పాకిస్తాన్ ను ఓడిస్తుందో లేదో చూడాలి. రసవత్తరమైన ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులంతా టీవిలకు అతుక్కుపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: