ఐసిసి మహిళా క్రికెట్ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో అన్ని జట్ల కెప్టెన్స్ కు విందు ఏర్పాటుచేశారు. ఇక ఆ విందు తర్వాత ప్రశ్నోత్తరాలు జరుగగా ఓ పాకిస్తాన్ విలేకరి భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ను అడిగిన ప్రశ్నకు అదే రేంజ్ లో జవాబిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది మిథాలి రాజ్.


ఇంతకీ ఆ రిపోర్టర్ ఏమన్నాడు అంటే.. ఇండియా పాక్ మేల్ క్రికెటర్స్ లో మీకు ఎవరంటే ఇష్టమని అడిగాడు. ఏదో అడిగాడు కదా అని ఆన్సర్ ఇవ్వకుండా ఇదే ప్రశ్న ఏ మగ క్రికెటర్ ను అయినా అడుగగలరా అని ఆన్సర్ ఇచ్చింది. మిథాలి రాజ్ ఇచ్చిన షాక్ కు పాక్ విలేకరికి నోట మాటరాలేదట. ఇక మిథాలి ఇచ్చిన జవాబుకి ట్విట్టర్ లో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభినందనలు తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: