మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగు వన్ డేల్లో గెలుస్తూ తమ ప్రతిభ చూపిస్తున్నారు మహిళా క్రీడాకారులు. ఇక నాలుగో వన్డే లో శ్రీలంక తో తలపడ్డ భారత జట్టు మొదటి బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు గాను 232 పరుగులు చేసింది. దీప్తి శర్మ 78, కెప్టెన్ మిథాలీ రాజ్ 53 పరుగులు చేశారు.   


ఇక లక్షచేధనలో బరిలో దిగిన శ్రీలంక జట్టు మ్యాచ్ గెలిచే ప్రయత్నాలు చేసినా భారత బౌలర్ల ముందు తలొగ్గక తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులను మాత్రమే చేసింది. 16 పరుగుల తేడాతో శ్రీలంక మీద ఇండియా జట్టు విజయం సాధించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: