టి20ల్లో వెస్టిండీస్ ఎంత పటిష్టమైన జట్టో మరోసారి ఋజువైంది.. ఐదు వన్డేల సీరీస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియా ఒకే ఒక్క మ్యాచ్ అయిన టి20ని మాత్రం దక్కించుకోలేకపోయింది. పొట్టి ఫార్మెట్ లో విండీస్ ఎంత ప్రమాదకరమో మరోసారి తెలిసేలా చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు మొదటి నుండి వేగంగానే ఆడినా దూకుడు మీద ఉన్న సమయంలోనే కొహ్లి, శిఖర్ ధావన్ ఇద్దరు వెంట వెంటనే ఔట్ అయ్యే సరికి జట్టు కష్టాల్లో పడ్డది. దినేష్ కార్తిక్ 48 పరుగులు తీసి జట్టు స్కోర్ 190 వచ్చేలా చేశాడు.


ఇక భారీ లక్ష్యమే అయినా వెస్టిండీస్ జట్టు ఓపెనర్ ఎవిన్ లూయిస్ అజేయంగా 125 పరుగులు తీసి ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడు. గేల్ 18 అవుట్ అవగా శ్యామ్యూల్స్ 38 పరుగులతో 18.3 ఓవర్లలో 194 పరుగులు తీసి విండీస్ విజయం అందుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: