మహిళల ప్రపంచ కప్ లో న్యూజిల్యాండ్ మీద ఘన విజయం సాధించింది సెమీస్ కు చేరుకుంది టీం ఇండియా. మిథాలి రాజ్ కెప్టెన్ గా తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయ ఢంఖా మోగించింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 265/7 పరుగులు చేసింది. మిథాలి రాజ్ 109 పరుగులతో చెలరేగగా, వేదా కృష్ణమూర్తి 70, హర్మన్ ప్రీత్ 60 పరుగులు చేశారు.


ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు 25.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయ్యారు. న్యూజిల్యాండ్ బ్యాటింగ్ లో అమి షట్టర్త్‌వెయిట్‌ (26) టాప్ స్కోర్ చేసింది. భారత్ బౌలర్ రాజేశ్వరీ గైక్వాడ్‌ 15 పరుగులకు 5 వికెట్లు, దీప్తి శర్మ 26 పరుగులకు 2 వికెట్లు తీసి జట్టు విజయాన్ని సునాయసం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: