మొత్తానికి భారత మహిళా క్రికెట్ క్రీడామణులకు బిసిసిఐ తరపునుండి నజరానా అందింది. ప్రపంచ మహిళా వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రేసులో దిగిన భారత జట్టు ఇప్పుడు ఫైనల్ కు చేరుకుంది. మిథాలి సారధ్యంలో టీం ఇండియా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ ఫైనల్ దాకా వచ్చింది.


ఇక ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో టీం ఇండియా పోటీ పడుతుంది. ప్రపంచ కప్ లో జట్టుని విజయవంతంగా నడిపించినందుకు గాను జట్టు సభ్యులకు బిసిసిఐ తలో 50 లక్షలు నజరానా ప్రకటించింది. ఇక సహాయక టీం కు 25 లక్షలు ఇస్తారట. మొత్తానికి బిసిసిఐ తరపునుండి మహిళా క్రికెట్ క్రీడాకారులు మంచి నజరానా అందుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: