మహిళా ప్రపంచ కప్ లో భారత జట్టు అపజయ పాలయ్యింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ పోరులో టీం ఇండియా మహిళా క్రికెటర్లు చివరి మ్యాచ్ లో చేతులెత్తేశారు. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా జులాన్ గోస్వామి 3 వికెట్లు, పూనం యాదవ్ 2 వికెట్లతో ఇంగ్లాండ్ జట్టుని 50 ఓవర్లకు 7 వికెట్లకు 228 పరుగులకు కట్టడి చేశారు.  


ఇక గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా ఓపెనర్ స్మృతి మందన డకౌట్ అవగా మరో ఓపెనర్ పూనం రౌత్ అత్యుత్తమ ప్రదర్శనతో 86 పరుగులు చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ మిథాలి రాజ్ 17 పరుగులకే నిష్క్రమించగా హర్మంత్ ప్రీత్ కౌర్ 51, వేద కృష్ణ్మూర్తి 35 పరుగులు చేసి స్కోర్ ముందుకు కదిలేలా చేశారు. చివరి సమయంలో అటు వికెట్లు ఇటు పరుగులు రెండిటిని కాపాడుకునే క్రమంలో 219 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీం ఇండియా. భారత్ పై ఇంగ్లాండ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: