శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా మరోసారి విజృంభించింది. 158 ఓవర్లకు గాను అత్యధికంగా 622/9 కు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 344తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీం ఇండియా పూజారా 133, రహనే 132 త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ 54, వృద్ధిమాన్ సాహా 67 పరుగులు చేశారు. రవింద్ర జడేజా కూడా 70 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 


మిడిల్ ఆర్డర్ లో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో జట్టు స్కోర్ భారీగా వెళ్లింది. శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడారు భారత బ్యాట్స్ మన్స్. ఏ కోణంలో కూడా వారికి అవకాశాన్ని ఇవ్వకుండా ఆటని కొనసాగించారు. కొలొంబోలో టీం ఇండియా స్కోర్ ఇదో రికార్డ్ అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: