ఇండియా శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. ఫాలో ఆన్ లో 230 పరుగుల చేయాల్సి ఉండగా నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకకు భారత బౌలర్ జడేజా 5/152 తో కుప్పకూల్చాడు. ఓవర్నైట్ లో 92 పరుగులతో క్రీజ్ లో ఉన్న కరుణరత్నె 141 పరుగులకు అవుట్ చేశాడు. 


రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 386 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కరుణరత్నే తర్వాత కుశాల్ మెడిస్ 110 పరుగ్ల తర్వాత ఏ ఒక్కరు అంతగా ఆకట్టుకోలేదు. మ్యాథ్యూస్ 36, డిక్ వెల్ల 31 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. ఇక మూడు టెస్ట్ ల సీరీస్ లో శ్రీలంకపై భారత జట్ట్తు 2-0తో సీరీస్ కైవసం చేసుకుంది. అంతేకాదు వరుసగా 8 టెస్టులు గెలిచి అత్యుత్తమ రికార్డ్ నమోదు చేసుకుంది. ఇక ఒక్క టెస్ట్ గెలిస్తే 9 టెస్టుల గెలిచిన ఆస్ట్రేలియా రికార్డును సమం చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: