భారత్ శ్రీలంక మీద జరుగుతున్న మూడు టెస్టుల సీరీస్ లలో రెండు టెస్టులు విన్ అయిన టీం ఇండియా రెండో టెస్ట్ లో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో బ్యాటింగ్ బౌలింగ్ రెండిటిలోనూ రాణించిన జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఇక శ్రీలంకపై రెండు సార్లు తన కెప్టెన్సీ లో రెండు మ్యాచులు గెలవడం సంతోషకరంగా ఉందని అన్నాడు కొహ్లి.


జట్టులో ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. వారి సామర్ధ్యాలు నాకు తెలుసు.. అందుకే తెలుపు మాకు అలవాటుగా మారిపోయిందని అన్నాడు భారత జట్టు కెప్టెన్ కొహ్లి. టెస్ట్ క్రికెట్ అంటే తమకు ఎంతో ప్రత్యేకమని గడిచిన 9 టెస్టుల్లో 600  పైగా పరుగులు తీయడం చూస్తే ఆటగాళ్లు ఎంత ఆకలితో ఉన్నారో అర్ధమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు అవకాశం కోసం ఎదురుచూడటమే కాదు దాన్ని అన్నివిధాలుగా వాడుతున్నారని కొహ్లి అభిప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: