టీం ఇండియా కెప్టెన్ కొహ్లికి మళ్లీ మరో రికార్డ్ నెలకొల్పే అవకాశం దక్కింది. ఈ గురువారం జరిగే శ్రీలంక వన్డేతో కొహ్లి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసే అవకాశం లభించింది. ఇప్పటికే ఈ ఇయర్ 14 వన్డేల్లో 769 పరుగులు చేసిన విరాట్ కొహ్లి ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు.


ఇప్పటికే ఈ ఇయర్ డూప్లిసిస్ 16 వన్డేల్లో 814పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 14 వన్డేల్లో 785 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కొహ్లి కనుక శ్రీలంక మ్యాచ్ లో రెచ్చిపోతే కనుక ఈ ఇద్దరిని క్రాస్ చేసి మొదటి స్థానం సంపాదించే అవకాశం ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: