విక్టర్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో తెలుగుతేజం పీవీ సింధూ సత్తా చాటింది. సియోల్ లో జరిగిన మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ఘన విజయం సాధించింది. మొదటి సెట్ ను 22-20 తేడాతో కైవసం చేసుకుంది. అయితే సెకెండ్ సెట్ లో 11-21 తేడాతో పరాజయం పాలైంది. 


దీంతో థర్డ్ సెట్ కీలకంగా మారింది. అంతేకాదు.. ఇదే నిర్ణయాత్మక సెట్ అయింది. ఇందులో సింధు ఒకుహరా హోరా హోరీగా తలపడ్డారు. ఈ సెట్ లో సత్తా చాటిన సింధు ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. అయితే ఈ సెట్ లో ఒకుహరా కొన్ని తప్పిదాలు చేసింది. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సింధు సక్సెస్ అయింది. ఫలితంగా  థర్డ్ సెట్ ని 21-18 తేడాతో కైవసం చేసుకుంది.  


రీసెంట్ గా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఒకుహరా చేతిలో పీవీ సింధు పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మరోసారి ఇద్దరూ తలపడే అవకాశం వచ్చింది. దీంతో గతంలో తనకు ఎదురైన పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ గంటా 23 నిమిషాల పాటు సాగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: