భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 టి20ల సీరీస్ లో మొదటి టి20 విజయం సాధించిన ఇండియా రెండో టి20లో చేతులు ఎత్తేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 8, శిఖర్ ధావన్ 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టించారు. ఇక వన్ డౌన్ దిగిన విరాట్ కొహ్లి కూడా డకౌట్ అవడంతో ఇండియా మరింత కష్టాల్లో పడ్డది. మనిష్ పాండే 6 పరుగులకే వెనుదిరగగా కెదర్ జాదవ్ 27, ధోని 13, హార్ధిక పాండ్య 25 పరుగులతో 20 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌట్ అయ్యారు.


ఆస్ట్రేలియా బౌలర్ బెహ్రాన్ డార్గ్ (4/21)తో భారత్ కు దెబ్బ కొట్టాడు. ఇక లక్ష్యం చిన్నదే అయినా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్ 8, డేవిడ్ వార్నర్ 2 పర్గులకే అవుట్ అవగా ఆ తర్వాత హెన్రిక్స్ 62, ట్రావిస్ హెడ్ 48 పరుగులకే ఆసిస్ విజయాన్ని ఖాయం చేశారు. కేవలం 15.3 ఓవర్లకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: