ప్రస్తుతం ఫాంలో ఉన్న భారత జట్టులో ఒకసారి స్థానం కోల్పోతే మళ్లీ అది కల్పించుకోవడం చాలా కష్టమని తెలిసిందే. శ్రీలంక సీరీస్ కు విశ్రాంతి కారణంగా జట్టుకి దూరమైన అశ్విన్, జడేజాలు ఆ తర్వాత ఆస్ట్రేలియా సీరీస్ కు దూరం పెట్టారు. ఇక ఇప్పుడు న్యూజిల్యాండ్ సీరీస్ కు వారిద్దరికి తుది జట్టులో స్థానం దక్కలేదు.


యువ స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుండగా న్యూజిల్యాండ్ సీరీస్ కు వీరినే తీసుకున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీరికి మళ్లీ జట్టులో ఛాన్స్ ఇప్పుడప్పుడే రావడం కష్టమే అని తెలుస్తుంది. ఇక న్యూజిల్యాండ్ తో జరిగే వన్ డే సీరీస్ లో ఫేసర్ శర్ధూర్ ఠాకూర్ కు ఛాన్స్ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: