భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5 వన్డేల సీరీస్ లో ఆసిస్ మీద 4-1తేడాతో గెలిచిన టీం ఇండియా ఆ దెబ్బతో ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. అప్పటిదాకా మొదటిస్థానంలో ఉన్న సౌతాఫ్రికా సెకండ్ ప్లేస్ కు వచ్చింది. అయితే ఇండియా నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చినందుకు సంబరాలు జరుపుకున్నారు. ఇక టీం ఇండియాకు తిరుగులేదని అనుకున్నారు.


కాని నెంబర్ వన్ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. సెకండ్ ప్లేస్ లో ఉన్న సౌతాఫ్రికా ప్రస్తుతం బంగ్లాదేష్ తో 3 వన్డేల సీరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడగా 2-0తో సౌతాఫ్రికా సత్తా చాటుతుంది. 2-0 తో సీరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా మళ్లీ ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ కు చేరింది. టీం ఇండియా, సౌతాఫ్రికా 120 పాయింట్స్ తో ఉన్నా డెసిమల్స్ లో సౌతాఫ్రికా ముందు ఉందట. అందుకే ఐసిసి నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: