టీం ఇండియా డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లిలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఓ ద్వారానికి వీరేంద్ర సెహ్వాగ్ పేరుని పెడుతున్నారట ఢిల్లి క్రికెట్ సంఘం. అక్టోబర్ 21న నుండి ఫిరోజ్ షా కోట్లా రెండో ద్వారానికి వీరేంద్ర సెహ్వాగ్ పేరు పెడుతున్నారట. ఆరోజు భారత్ న్యూజిల్యాండ్ మధ్య టి20 మ్యాచ్ జరుగనుంది.


ప్రస్తుతం ఇండియా న్యూజిల్యాండ్ మధ్య 3 వన్ డేల సీరీస్ జరుగుతుంది. మొదటి వన్ డేలో భారత్ కు షాక్ ఇస్తూ న్యూజిల్యాండ్ గెలిచింది. ప్రస్తుతం సీరీస్ లో 1-0తో న్యూజిల్యాండ్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా మీద వన్ డే సీరీస్ గెలిచిన టీం ఇండియా మిగతా రెండు మ్యాచ్ లను గెలిస్తేనే సీరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: