ఇండియా న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్ డేల సీరీస్ లో భాగంగా ఈరోజు కాన్పూర్ లో జరిగిన 3వ వన్ డేలో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 14 పరుగులకే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోగా రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శనతో 147, విరాట్ కొహ్లి ధీటైన బ్యాటింగ్ తో 113 పరుగులు చేసి భారీ స్కోర్ వచ్చేలా చేశారు. ఇక చివర్లో ధోని 25, కేదర్ జాదవ్ 18 పరుగులతో భారత్ 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. 


ఇక భారీ లక్ష్యం ఛేధించే ప్రయత్నంలో కివీస్ గుప్టిల్ 10 పరుగులకే అవుట్ అవగానే మున్రో 75 పరుగులతో మ్యాచ్ మీద ఆశలు నిలిపాడు. ఇక విలియమ్స్, లాథం 64, 65 పరుగులతో మ్యాచ్ పై పట్టు సాధించగా హెన్రీ నికోల్స్ 37 పరుగులతో కివీస్ గెలుస్తుందేమో అన్న ఊపు తెచ్చాడు. అయితే చివర్లో బూమ్రా అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 6 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఇక మూడు వన్డే ల సీరీస్ లో 2-1తో భారత్ జట్టు ఈ సీరీస్ కూడా కైవసం చేసుకుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: