వన్ డే సీరీస్ కైవసం చేసుకున్న భారత్ టి20 సీరీస్ కూడా మనదే అన్న ఊపు తెచ్చింది. మొదటి టి20 ఢిల్లి ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 80, శిఖర్ ధావన్ 80 పరుగులతో సత్తా చాటారు. కివీస్ బౌలర్లను చీల్చి చెండాడిన ఈ ఇద్దరు జట్టుకి అధిక స్కోర్ వచ్చేలా చేశారు. చివర్లో కొహ్లి 26 పరుగులతో 20 ఓవర్లకు 3 వికెట్లకు 202 పరుగులు చేశారు.


ఇక భారీ లక్ష్య ఛేధనకు దిగిన కివీస్ బ్యాటింగ్ లో విలియం సన్ 28, లాథం 39 పరుగులు తప్ప మిగతా ఎవరు క్లిక్ అవలేదు. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన కివీస్ 149 పరుగులు చేసింది. 53 పరుగుల తేడాతో న్యూజిల్యాండ్ పై ఇండియా గ్రేట్ విక్టరీ సాధించింది. 3 టి20లలో 1 మ్యాచ్ గెలిచిన ఇండియా 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇదే మ్యాచ్ లో ఆశిష్ నెహ్రా తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కొహ్లి, ధావన్ తమ భుజాల మీద నెహ్రాను స్టేడియం అంతా తిప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: