భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సీరీస్ లో మొదటి టి20 విజయం సాధించిన టీం ఇండియా ఈరోజు జరిగిన సెకండ్ టి20 లో చేతులు ఎత్తేసింది. టాస్ గెలిచిన కివీస్ తొలిత బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు కొలిన్ మున్రో 109, గప్టిల్ 45 విజృంభించడంతో 20 ఓవర్లకు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది న్యూజిల్యాండ్.


ఇక భారీ లక్ష్య ఛేధనలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ 5, శిఖర్ ధావన్ 1 పరుగులకే పెవిలియన్ బాట పట్టగా శ్రేయాస్ అయ్యర్ 23, విరాట్ కొహ్లి 65 మ్యాచ్ విన్నింగ్ కు ప్రయత్నించారు. ఇక చివర్లో ధోని 49 పరుగులు చేసినా బాల్స్ తగ్గడం ఛేదించాల్సిన స్కోర్ పెరగడంతో సెకండ్ టి20 కివీస్ సొంతమైంది. కివీస్ బౌలర్ బోల్ట్ 4 వికెట్లు తీసి ఇండియాను విజయానికి దూరం చేశాడు. ఇక ప్రస్తుతం సీరీస్ 1-1తో ఇరు జట్లు ఉండగా మూడవ టొ20 ఎవరు గెలుస్తారో వారికే సీరీస్ సొంతం అవుతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: