ఇండియా శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీం ఇండియా బ్యాట్స్ మన్ శ్రీలంకకు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ లోనే అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యతతో భారత ఆటగాళ్లు భారీ ఆధిక్యాన్ని సాధించారు. ఇక కెప్టెన్ విరాట్ కొహ్లి మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 213 పరుగులతో తన టెస్టు కెరియర్ లో ఐదో డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటాడు. 


ఇక మొదటి ఇన్నింగ్స్ లో పూజారా 143, మురళి విజయ్ 128 పరుగులు చేయగా రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 610 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక అనంతర సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీలంక 21 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇండియా 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడు రోజుల మ్యాచ్ ముగిసింది. రానున్న రెండు రోజుల్లో ఆధిక్యాన్ని ఛేధించి భారత్ కు నిర్ధిష్ట లక్షం శ్రీలంక ఇవ్వాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: