ఇండియా శ్రీలంకల మధ్య జరుగుతున్న 3 టెస్టుల సీరీస్ లో భాగంగా జరిగిన 2వ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ 205కే ఆలౌట్ అవగా ఇండియా తొలి ఇన్నింగ్స్ 610 పరుగ్లు చేసి డిక్లేర్ చేసింది. ఇక 21/1 ఓవర్ నైట్ స్కోర్ తో ఉన్న శ్రీలంక 4వ రోజు 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు తీశాడు. ఇశాంత్ శర్మ, రవింద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశాడు. ఇక  బ్యాటింగ్ లో పరుగుల మిషన్ విరాట్ కొహ్లి మరోసారి తన సత్తా చాటాడు. ఏమాత్రం ప్రత్యర్ధి జట్టుకి ఛాన్స్ లేకుండా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. కెప్టెన్ గా ఐదో డబుల్ సెంచరీ చేసిన వాడిగా రికార్డ్ సృష్టించాడు కొహ్లి.


మరింత సమాచారం తెలుసుకోండి: