టెస్ట్ సీరీస్ గెలిచిన టీం ఇండియాకు షాక్ ఇస్తూ 3 వన్డే సీరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ కు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు శ్రీలంక ఆటగాళ్లు. 113 పరుగులకే ఆలౌట్ చేసి కేవలం 20.4 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ కంప్లీట్ చేశారు. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బౌలర్ లక్మల్ మరోసారి టీం ఇండియాపై విరుచుకుపడ్డాడు. 4 వికెట్లను తీసి టీం ఇండియా కు షాక్ ఇచ్చాడు.


ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్ ఉపుల్ తరంగా 45, మ్యాథ్యూస్ 25, డిక్ వెల్ల 26 పరుగులు చేశారు. ఇండియా జట్టులో ఎమ్మెస్ ధోని ఒక్కడే 65 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ 19, హార్ధిక్ పాండే 10 పరుగులు తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: