క్రికెట్‌ అభిమానులకు ముఖ్యంగా భారత క్రికెట్ ప్రియులకు ఇది కచ్చితంగా శుభవార్త అని చెప్పొచ్చు. 2023 లో జరిగే ప్రపంచ కప్ లో భారత్ తొలిసారి పూర్తిస్త్యాయి ఆతిథ్యం ఇవ్వనుందట. ఇది కచ్చితంగా క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక దానికంటే ముందు 2021లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్ లో జరుగుతుందని బిసిసిఐ స్పష్టం చేసింది.    


గతంలో ఎన్నోసార్లు భారత్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగాయి. అయితే కేవలం కొద్ది మ్యాచులను మాత్రం ఇక్కడ ఆతిధ్యం ఇవ్వడం జరిగింది. కాని ఈసారి 2023లో పూర్తిస్థాయిలో భారత్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని క్రికెట్ అభిమానులు మన దేశంలో ఉన్నారు. ప్రపంచ కప్ భారత్ లో జరగడం అనేది నిజంగా క్రికెట్ అభిమానులకు పండుగే..  


మరింత సమాచారం తెలుసుకోండి: