కొత్త తరహా పేమెంట్ బ్యాంక్ ని పేటీఏం మొదలు పెడుతోంది. ఇది మార్కెట్ లోకి వచ్చిన తరవాత కొత్త చారిత్రిక నిర్ణయం అవుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నుంచి తమ కార్యకలాపాలు మొదలవుతాయి  అని బ్యాంక్ అధ్యక్షురాలు రుచితా తనజా అగర్వాల్ చెప్పారు. బ్యాంకు కి సంబంధించి ఆర్బీఐ నుంచి ఆఖరి లైసెన్స్ రావాల్సి ఉంది అనీ అది రావడం ఆలస్యం తమ కార్యకలాపాలు మొదలు పెట్టేస్తాం అనీ పేర్కొన్నారు ఆమె. పేమెంట్ బ్యాంకు ద్వారా సరికొత్త వ్యాపార విధానాన్ని అవలంబిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ బ్యాంకు సాయంతో చిన్నపట్టణాలకూ పేటీఎంను విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పేటె ఎం ని నగరం లోని 13 కోట్ల మంది వాడుతున్నారు అంటున్నారు ఆమె. ఇరవై నగరాల్లో వాడుతున్న ప్రస్తుతం యాప్ ని విస్తరిస్తూ పేమెంట్ బ్యాంక్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఉత్పత్తులు అందించే పలు బ్యాంకులు, సంస్థలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకో బోతున్నారు.   భవిష్యత్తులో ఫిజికల్ టచ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని తనూజ వివరించారు. అలాగే పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ పొందడం వల్ల పేటీఎం వ్యాలెట్‌లోని బ్యాలెన్స్‌పై వడ్డీని చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పిన ఆమె వడ్డీ ఎంతన్న విషయాన్ని పేర్కొనలేదు. వడ్డీ కోసం పేటీఎం వ్యాలెట్ ఉన్నవారు తమ ఖాతాను ఎస్బీ ఎకౌంట్‌కు మార్చుకోవాల్సి ఉంటుందని తనూజ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: