శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు చేపట్టిన పీఎస్ఎల్వీ సీ36 ప్రయోగం విజయవంతమైంది. రిసోర్స్శాట్-2ఏ ను వాహకనౌక విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహకనౌక మొత్తం 17 నిమిషాల్లో వివిధ కక్ష్యలను దాటి ఉపగ్రహాన్ని 817 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ శాస్త్రవేత్తలందరి కృషిని కొనియాడారు.