రిలయన్స్ జియో లో ఇంకా పెట్టుబడులు పెట్టడం కోసం ముఖేష్ అంబానీ సిద్దమయ్యారు. మార్కెట్ లో ఇతరత్రా నెట్వర్క్ ల నుంచి ఎదురు అవుతున్న పోటీ ని సమర్ధంగా ఎదురు కోవడం కోసం మరొక నాలుగున్నర బిలియన్ డాలర్ ల పెట్టుబడి ఆయన పెడుతున్నారు. జియో నెట్వర్క్పై 25 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన ముకేశ్ జియో స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైట్స్ ఆఫర్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించినట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. జియోలో ప్రస్తుతం 7.24 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని, ప్రతి రోజు కొత్తగా 6 లక్షల మంది జియోలోకి మారుతున్నారని సంస్థ పేర్కొంది.