నెలకి మూడు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎం ని వినియోగించాల్సిన అవసరం ఏముంటుంది అని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేసారు. తాము తమ నిర్ణయం వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు అనీ జనాలు ప్రత్యామ్న్యాయ మార్గాలు ఎంచుకోవడం తప్పదని అన్నారు .. ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఓ గృహస్తుడికి నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయోగించాల్సినంత అవసరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అవసరం వ్యాపారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదని సూచించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: