రిలయన్స్ జియో పోటీ ని తట్టుకోవడం కోసం ఎన్నో ఆఫర్ లు ఇస్తోంది ఎయిర్టెల్ సంస్థ .. ఇప్పుడు కొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందరకి వచ్చింది ఈ సంస్థ .పోస్ట్ పైడ్ కస్టమర్ ల కోసం ఎయిర్టెల్ సర్ప్రైజ్ అంటూ 30 జీబీ వరకూ 4జీ డేటాని అందించింది. అందుకోసం తమ వినియోగదారులు 'మై ఎయిర్టెల్ యాప్'లోకి వెళ్లి అందులో పోస్ట్పెయిడ్ ఆఫర్స్ యాక్టివేట్ చేసుకోవాలని సూచించింది.యాప్లోని బానర్పై కనిపించే ‘క్లెయిమ్ ఫ్రీ డాటా’పై క్లిక్ చేస్తే ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుందని సూచించింది. ఆ సంస్థ సీఈవో గోపాల్ విఠల్ మాట్లాడుతూ... దేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్వర్క్ను అందిస్తున్నామని, ఈ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. తమ ప్రయాణంలో భాగస్వాములైన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.