ప్రాపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ యూజ్ చెయ్యని కుర్రకారు ఉండదు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా పలు సంస్థలు అనెక్ అంశాల మీద నిఘా పెడుతూ వస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీ లు తమదగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని అమ్మేసుకుంటూఉన్నాయి అని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఫేస్ బుక్ దానికి వీలు లేకుండా నిషేధాన్ని విధించింది.


ఆయా సంస్థ‌లు ముఖ్యంగా ప‌లు దేశాల్లో వర్ణవివక్షతో కూడా ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్లు స‌మాచారం. ఫేస్‌బుక్‌లో త‌మ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే వారికి ఈ నిఘా అనేది ముప్పుగా మారుతోంది. ఇప్పుడు ఇలా ఫేస్‌బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు తెలిపారు. ఫేస్‌బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు  కొన్ని రకాల టూల్స్ ఉంటాయని, వీటి ద్వారానే ఎవరెవరు ఎలాంటి పోస్టింగులు చేస్తున్నారో పరిశీలించవచ్చని చెప్పారు.


అమెరికా లాంటి దేశాల్లో నిఘా సంస్థలు వీటిని ఉప‌యోగిస్తున్నాయి. ఇందుకోసం 2010 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్లు ఖ‌ర్చుచేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: