టెలీకాం కంపెనీ ల మధ్యన నెలకొన్న విపరీతమైన పోటీ ని తట్టుకోవడం కోసం నెట్వర్క్ కంపెనీలు వివిధ ఆఫర్ లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఐడియా సెల్యులార్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. 2జీ, 3జీ, 4జీ అనే భేదం లేకుండా ఏ సేవనైనా ఒకే ధరకు అందించాలని నిర్ణయించింది.
అయితే 1జీబీ, అంతకంటే తక్కువ డేటాను రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు వివిధ డేటా ప్యాక్లకు వివిధ చార్జీలు వసూలు చేస్తున్న ఐడియా ఇక నుంచి అన్నింటికీ ఒకే ధర వసూలు చేయాలని నిర్ణయించింది. ఈనెలాఖరు నుంచే దీనిని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రూ.170 రీచార్జ్తో 1జీబీ 2జీ సేవలు పొందవచ్చు.