ఉచిత మంత్రం జపిస్తూ మార్కెట్ లోకి వచ్చిన రిలయన్స్ జియో సంస్థ మీద ఇతర కంపెనీలు యమా సీరియస్ గా ఉన్నాయి. అయితే అందరి లాగా సైలెంట్ గా ఉండకుండా ఎయిర్టెల్ సంస్థ సీరియస్ అవుతూ కేసులు వేస్తోంది. అయితే, ఎయిర్టెల్ తీరుపై రిలయన్స్ జియో మండిపడింది. దేశంలో తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్ టెల్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కలిసి ఎయిర్ టెల్ ఇలా ప్రకటించకుంటోందని పేర్కొంది. ఎయిర్టెల్ ప్రకటనలపై అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేస్తూ ఎయిర్ టెల్ ప్రకటన అంతా అసత్యమేనని చెప్పింది.