4 జీ సేవలు మరింత విసృతంగా అందించాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నాయి అన్ని సెల్ ఫోన్ కంపెనీలూ. దేశీయ బ్రాడ్ బ్యాండ్ సేవల సంస్థ టికోనా ని కొనుగోలు చేసి మరీ బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ ని పెంచుతోంది ఎయిర్టెల్ సంస్థ . ఈ డీల్ లో దాదాపు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఎయిర్టెల్.ఈ ఒప్పందంతో టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రంతో పాటు మరో నాలుగు టెలికాం సర్కిల్స్లో 350 సైట్లు తమ సొంతం కానున్నట్టు తెలిపింది. రిలయన్స్ తో పాటు ఇతర సంస్థల నుంచి వస్తోన్న ఇంటర్నెట్ స్పీడ్ పోటీని తట్టుకునేందుకే ఎయిర్ టెల్ టికోనాతో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రవేశం ద్వారా స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థల నిష్క్రమణలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.