రిలయన్స్ జియో ప్రకటించిన సర్ప్రైజ్ సమ్మర్ ఆఫర్ ని ఉపసంహరించుకోవాలి అనే ట్రాయ్ ఆదేశాలు జారీ చెయ్యడం తెలిసిన విషయమే. దీంతో ఇతర టెలికాం సంస్థల షేర్లు ఈ రోజు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర కంపెనీలు పైకి ఎగబాకుతున్నాయి. నేటి మార్కెట్లో మదుపర్లు టెలికాం ఇండెక్స్ లో కొనుగోళ్లవైపు ఆసక్తి చూపారు. ఈ రోజు భారతి ఎయిర్ టెల్ సుమారు 3 శాతంపైగా ఎగిసి టాప్ గెయినర్గా నిలవగా, ఐడియా సెల్యులర్ 2 శాతానికిపైగా జంప్ చేసింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతానికి పైగా నష్టపోయింది.